ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూపు అధినేత రతన్ టాటాకు మరో అరుదైన గౌరవం లభించింది. నవకల్పనకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన దాతృత్వ సేవలకుగాను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్.. గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.
ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో టాటాకు ఈ ఆవార్డును ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధ్యక్షురాలు, ఉపకులపతి ప్రొఫెసర్ డామీ నాన్సీ రోత్వెల్ భారత పర్యటనలో భాగంగా ఈ అవార్డును అందజేశారు.
రతన్ టాటా హయాంలో..
రతన్ టాటా నేతృత్వంలో టాటా గ్రూపు.. 1991 నుంచి 2012 వరకు ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగిందని యూనివర్సిటీ కితాబిత్చింది. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన టెట్లీ, డైవూ, కోరస్, జాగ్వార్ ల్యాండ్రోవర్ వంటి సంస్థలను విలీనం చేసుకుని ప్రపంచలోని అతిపెద్ద కాంగ్లోమెరిట్ సంస్థల సరసన చేరిందని పేర్కొంది. టాటా సంస్థ ఈ స్థాయికి చేరడంలో రతన్ టాటా కృషిని యూనివర్సిటీ ప్రశంసించింది.
ఇదీ చూడండి:మీకు తెలుసా... రతన్ టాటాకూ ఉందో లవ్స్టోరీ..!