Millitants Killed Kashmir Pandit: జమ్ముకశ్మీర్లో మరో కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. షోపియాన్ జిల్లా చోటిపొరాలోని యాపిల్ తోటలో ఉన్న ఇద్దరు సోదరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోగా ఆయన సోదరుడు పింటూ కుమార్కు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
గత వారం రోజులుగా కశ్మీర్లో ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఆదివారం నౌషేరాలో ఓ పోలీసును కాల్చిచంపారు. గత వారం బందిపొరాలో ఓ వలస కూలీని బలి తీసుకున్నారు. బుద్గామ్, శ్రీనగర్ జిల్లాల్లో సోమవారం రెండు గ్రనేడ్ దాడులకు పాల్పడ్డారు.