ETV Bharat / bharat

నిర్భయ కేసు: ఉరిపై వీడని ఉత్కంఠ- నేడూ విచారణ

author img

By

Published : Mar 19, 2020, 6:46 AM IST

Updated : Mar 19, 2020, 8:40 AM IST

నిర్భయ కేసులో దోషుల ఉరిపై ఉత్కంఠ వీడటం లేదు. ఉరిని వాయిదా వేయాలంటూ దోషులు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు దిల్లీ కోర్టు విచారణ చేపట్టనుంది. రెండోసారి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​, క్యురేటివ్​ పిటిషన్లు పెండింగ్​లో ఉన్నాయని కోర్టుకు వివరించారు దోషుల తరఫు న్యాయవాది.

NIRBHAYA CASE
నిర్భయ

నిర్భయ కేసు: ఉరిపై వీడని ఉత్కంఠ- నేడూ విచారణ

నిర్భయ కేసులో దోషులు దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు దిల్లీ కోర్టు విచారణ చేపట్టనుంది. క్యురేటివ్​, క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్​లో ఉన్నాయని.. ఫలితంగా ఉరిని వాయిదా వేయాలని పిటిషన్​ దాఖలు చేశారు నిర్భయ దోషులు.

దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ మంగళవారం రెండో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. మరో దోషి పవన్ గుప్తా సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇవి పెండింగ్​లో ఉన్న కారణంగా ఉరిని వాయిదా వేయాలని దిల్లీ కోర్టులో మరో పిటిషన్​ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ముకేశ్​కు చుక్కెదురు..

మరో వ్యాజ్యానికి సంబంధించి నిర్భయ దోషి ముకేష్​కు చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్.

ఇదీ చూడండి: నిర్భయ దోషికి షాక్... పిటిషన్​ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు

నిర్భయ కేసు: ఉరిపై వీడని ఉత్కంఠ- నేడూ విచారణ

నిర్భయ కేసులో దోషులు దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు దిల్లీ కోర్టు విచారణ చేపట్టనుంది. క్యురేటివ్​, క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్​లో ఉన్నాయని.. ఫలితంగా ఉరిని వాయిదా వేయాలని పిటిషన్​ దాఖలు చేశారు నిర్భయ దోషులు.

దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ మంగళవారం రెండో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. మరో దోషి పవన్ గుప్తా సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇవి పెండింగ్​లో ఉన్న కారణంగా ఉరిని వాయిదా వేయాలని దిల్లీ కోర్టులో మరో పిటిషన్​ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ముకేశ్​కు చుక్కెదురు..

మరో వ్యాజ్యానికి సంబంధించి నిర్భయ దోషి ముకేష్​కు చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్.

ఇదీ చూడండి: నిర్భయ దోషికి షాక్... పిటిషన్​ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు

Last Updated : Mar 19, 2020, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.