అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మరిడిమాంబ ఉత్సవాలకు పోలీసుల అనుమతి కోరితే.. నిబంధనలతో కూడిన నోటీసులు జారీ చేయడంపై తెలుగుదేశం సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వందల ఏళ్లుగా జరుగుతున్న మరిడిమాంబ మహాలక్ష్మి జాతర నిర్వహణకు అర్థంలేని నిబంధనలతో నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిబంధనులు పాటిస్తే అసలు ఉత్సవాలు జరపలేమన్నారు. ఉత్సవాలపై ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని అయ్యన్న స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా.. గిరిజనుల కోసం ఏర్పాటు చేయవచ్చు: మంత్రి పేర్ని