ETV Bharat / state

ధర్నాలు నిరసనలకు అనుమతి లేదు : డీఎస్పీ శ్రావణి

author img

By

Published : Apr 22, 2021, 11:52 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కొవిడ్ విజృంభిస్తున్న దృష్ట్యా సభలు, సమావేశాలకు అనుమతులు లేవని పాలకొండ డీఎస్పీ శ్రావణి స్పష్టం చేశారు. మాస్కును విధిగా ధరించాలని.. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆమె సూచించారు.

ధర్నాలు నిరసనలకు అనుమతి లేదు : డీఎస్పీ శ్రావణి
ధర్నాలు నిరసనలకు అనుమతి లేదు : డీఎస్పీ శ్రావణి

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సమ్మెలు, నిరసనలు, ధర్నాలకు అనుమతులు ఇవ్వబోమని పాలకొండ డీఎస్పీ శ్రావణి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు నేరుగా వినతిపత్రం రూపంలో అందించవచ్చని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా సమ్మెలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తే ఉపేక్షంచేది లేదని.. సెక్షన్ 30, 188 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తేల్చిచెప్పారు.

కరోనా బారిన డిపార్ట్​మెంట్ సిబ్బంది..

ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో విధులు నిర్వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆమె పేర్కొన్నారు. పాలకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వేగవంతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మాస్క్​ను విధిగా ధరించాలి : డీఎస్పీ

అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని డీఎస్పీ శ్రావణి అన్నారు. మాస్క్​ను విధిగా ధరించాలని.. లేని పక్షంలో భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై సీహెచ్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో నేడు రెండోవిడత వ్యాక్సినేషన్‌ స్పెషల్ డ్రైవ్‌

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సమ్మెలు, నిరసనలు, ధర్నాలకు అనుమతులు ఇవ్వబోమని పాలకొండ డీఎస్పీ శ్రావణి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు నేరుగా వినతిపత్రం రూపంలో అందించవచ్చని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా సమ్మెలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తే ఉపేక్షంచేది లేదని.. సెక్షన్ 30, 188 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తేల్చిచెప్పారు.

కరోనా బారిన డిపార్ట్​మెంట్ సిబ్బంది..

ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో విధులు నిర్వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆమె పేర్కొన్నారు. పాలకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వేగవంతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మాస్క్​ను విధిగా ధరించాలి : డీఎస్పీ

అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని డీఎస్పీ శ్రావణి అన్నారు. మాస్క్​ను విధిగా ధరించాలని.. లేని పక్షంలో భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్సై సీహెచ్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో నేడు రెండోవిడత వ్యాక్సినేషన్‌ స్పెషల్ డ్రైవ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.