ETV Bharat / state

భారత్​ కథనానికి స్పందన: ఇతర జిల్లాల నుంచి టమాటా దిగుమతి నిలిపివేత - కృష్ణాలోని టమోటా రైతుల కోసం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి నిలిపివేత

టమోటా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు.. ఎట్టకేలకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో సరైన మద్దతు ధర రాక పంటను నదిలో పారబోయడంపై.. ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. ఇతర ప్రాంతాల నుంచి టమాటా దిగుమతిని నిలిపివేయాలంటూ.. జిల్లాలోని రైతు బజార్​లకు ఆదేశాలు జారీచేసినట్లు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ రామాంజనేయులు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకపోయినా.. ఎవరైనా పంటను రైతుబజార్​లో అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

marketing officials responded on mopidevi tomato farmers problems
మోపిదేవి టమోటా రైతుల సమస్యలపై స్పందించిన అధికారులు
author img

By

Published : Mar 24, 2021, 8:38 PM IST

టమోటా రైతుల సమస్యలపై అధికారుల చర్యలు

'దళారుల దందా.. టమాటా రైతుకేది అండ?' పేరిట ఈటీవీ భారత్​లో వెలువడిన కథనానికి.. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సి. రామాంజనేయులు, ఇంఛార్జి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎం.దివాకర్ రావు, దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆనంద్.. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవిలంక, కోసురువారిపాలెంలో పర్యటించారు. టమాటా రైతులను కలిసి వారి సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస గిట్టుబాటు ధరలేక.. టమాటా పంటను రైతులు నదిలో పారబొయ్యడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

దిగుమతి నిలిపివేశాం:

స్థానికంగా పండిన టమాటా విక్రయం పూర్తయ్యేవరకు.. జిల్లాలోని రైతుబజార్​లకు ఇతర ప్రాంతాల నుంచి సరుకు దిగుమతి కాకుండా రైతు బజార్ ఎస్టేట్ అధికారులను ఆదేశించినట్లు రామాంజనేయులు తెలిపారు. కేవలం కృష్ణాలో పండిన టమాటాలు మాత్రమే రైతులు అమ్ముకునేలా.. ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రైతు బజార్ కార్డులు లేనప్పటికీ పంటను విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కిలో రూ. 14 చొప్పున ఎంతమందైనా రైతు బజార్​కు తీసుకువెళ్లవచ్చన్నారు.

అంత వ్యత్యాసమా...?

పొలం దగ్గర కిలో టమాటాకి కేవలం రూ.4 మాత్రమే వస్తున్నాయని అధికారుల వద్ద రైతులు వాపోయారు. మార్కెట్ ధరకు, సాగుదారుడికి అందే డబ్బుకి రూ.10 వ్యత్యాసం ఉండటంపై.. స్థానిక మార్కెటింగ్ శాఖ అధికారుల మీద రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమోటాలు కొనుగోలు చేసే వ్యాపారులతో వెంటనే సమావేశం నిర్వహించి.. ధరల్లో వ్యత్యాసం ఎక్కువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత కథనం:

దళారుల దందా.. టమాటా రైతుకేది అండ?

టమోటా రైతుల సమస్యలపై అధికారుల చర్యలు

'దళారుల దందా.. టమాటా రైతుకేది అండ?' పేరిట ఈటీవీ భారత్​లో వెలువడిన కథనానికి.. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సి. రామాంజనేయులు, ఇంఛార్జి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఎం.దివాకర్ రావు, దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆనంద్.. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవిలంక, కోసురువారిపాలెంలో పర్యటించారు. టమాటా రైతులను కలిసి వారి సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస గిట్టుబాటు ధరలేక.. టమాటా పంటను రైతులు నదిలో పారబొయ్యడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

దిగుమతి నిలిపివేశాం:

స్థానికంగా పండిన టమాటా విక్రయం పూర్తయ్యేవరకు.. జిల్లాలోని రైతుబజార్​లకు ఇతర ప్రాంతాల నుంచి సరుకు దిగుమతి కాకుండా రైతు బజార్ ఎస్టేట్ అధికారులను ఆదేశించినట్లు రామాంజనేయులు తెలిపారు. కేవలం కృష్ణాలో పండిన టమాటాలు మాత్రమే రైతులు అమ్ముకునేలా.. ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రైతు బజార్ కార్డులు లేనప్పటికీ పంటను విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కిలో రూ. 14 చొప్పున ఎంతమందైనా రైతు బజార్​కు తీసుకువెళ్లవచ్చన్నారు.

అంత వ్యత్యాసమా...?

పొలం దగ్గర కిలో టమాటాకి కేవలం రూ.4 మాత్రమే వస్తున్నాయని అధికారుల వద్ద రైతులు వాపోయారు. మార్కెట్ ధరకు, సాగుదారుడికి అందే డబ్బుకి రూ.10 వ్యత్యాసం ఉండటంపై.. స్థానిక మార్కెటింగ్ శాఖ అధికారుల మీద రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమోటాలు కొనుగోలు చేసే వ్యాపారులతో వెంటనే సమావేశం నిర్వహించి.. ధరల్లో వ్యత్యాసం ఎక్కువ ఉండకుండా చూడాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత కథనం:

దళారుల దందా.. టమాటా రైతుకేది అండ?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.