ETV Bharat / state

గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఆలయాల్లో చోరీ - temples robbery in Gunther district

chori taza
chori tazachori taza
author img

By

Published : Sep 11, 2021, 10:43 AM IST

Updated : Sep 11, 2021, 1:50 PM IST

10:41 September 11

హుండీలు పగులగొట్టి చోరీచేసిన దుండగులు

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రెండు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ఆలయాలను టార్గెట్ చేసి దుండగులు దొంగతనం చేశారు. పొన్నపల్లి గ్రామంలోని శ్రీ కనుమూరి అమ్మవారి ఆలయం, నడింపల్లి గ్రామ శివాలయాల్లోకి అర్ధరాత్రి సమయంలో చొరబడి హుండీలను పగలకొట్టి నగదు అపరించుకుపోయారు. 

ఉదయం ఆలయం వద్దకు వచ్చిన పూజారులు, స్థానిక భక్తులు ఆలయ తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గమనించి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల హుండీల్లో సుమారు 50 వేల రూపాయల కానుకలు, నగదు ఉంటుందని పూజారులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: Bank Robbery : పొట్టకూటి కోసం బ్యాంక్​ దోపిడీ.. దంపతుల అరెస్ట్

10:41 September 11

హుండీలు పగులగొట్టి చోరీచేసిన దుండగులు

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రెండు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ఆలయాలను టార్గెట్ చేసి దుండగులు దొంగతనం చేశారు. పొన్నపల్లి గ్రామంలోని శ్రీ కనుమూరి అమ్మవారి ఆలయం, నడింపల్లి గ్రామ శివాలయాల్లోకి అర్ధరాత్రి సమయంలో చొరబడి హుండీలను పగలకొట్టి నగదు అపరించుకుపోయారు. 

ఉదయం ఆలయం వద్దకు వచ్చిన పూజారులు, స్థానిక భక్తులు ఆలయ తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గమనించి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల హుండీల్లో సుమారు 50 వేల రూపాయల కానుకలు, నగదు ఉంటుందని పూజారులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: Bank Robbery : పొట్టకూటి కోసం బ్యాంక్​ దోపిడీ.. దంపతుల అరెస్ట్

Last Updated : Sep 11, 2021, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.