గుంటూరులో చేపల మార్కెట్ లో తూనికలు,కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. మార్కెట్ లో కాటాల పనితీరును పరిశీలించారు. దుకాణాల్లో నిర్ణీత బరువుకంటే తక్కువ బరువు నమోదైన దుకాణదారులుపై కేసులు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ కాటాల వినియోగం ఆవశ్యకతపై చైతన్యం కల్పించేందుకు ఛాయచిత్రాన్ని ప్రదర్శించారు. ఈ దాడుల్లో తూనికలు, కొలతల శాఖ రీజనల్ జాయింట్ కంట్రోలర్ రాజ్ కుమార్, డిప్యూటీ కంట్రోలర్ కృష్ణచైతన్య లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బద్వేలులో విజిలెన్స్ అధికారుల సోదాలు