ETV Bharat / state

విద్యుత్తు తీగలు తగిలి ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

author img

By

Published : Nov 22, 2020, 8:11 PM IST

ఓ ప్రైవేటు వెంచర్​లో విద్యుత్తు తీగలు కిందకి వేలాడాయి. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అవి ఒక కూలి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. మరొకరిని గాయాలపాలు చేశాయి.

One person died
విద్యుత్తు తీగలు తగిలి ఒకరు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొండికాల్వలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్తు తీగలు తగిలి ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మల్లికార్జున అనే వ్యక్తి మొండికాల్వ వద్ద ఉన్న వెంచర్​లో పనిచేస్తున్నాడు. వెంచర్​ మార్గ మధ్యలో విద్యుత్తు తీగలు కిందికి ఉండటం గమనించని మల్లికార్జున, మరో వ్యక్తి మధుతో కలిసి ద్విచక్రవాహనం​పై అటుగా వెళ్లాడు. దాంతో అతని తలకు తీగలు తగిలాయి. వెంటనే ఇద్దరూ కిందపడిపోయారు.

స్థానికులు హుటాహుటిన వాళ్లని చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మధుకు గాయాలయ్యాయి. మృతుడి స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని మండలం కళ్లబాయిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొండికాల్వలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్తు తీగలు తగిలి ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మల్లికార్జున అనే వ్యక్తి మొండికాల్వ వద్ద ఉన్న వెంచర్​లో పనిచేస్తున్నాడు. వెంచర్​ మార్గ మధ్యలో విద్యుత్తు తీగలు కిందికి ఉండటం గమనించని మల్లికార్జున, మరో వ్యక్తి మధుతో కలిసి ద్విచక్రవాహనం​పై అటుగా వెళ్లాడు. దాంతో అతని తలకు తీగలు తగిలాయి. వెంటనే ఇద్దరూ కిందపడిపోయారు.

స్థానికులు హుటాహుటిన వాళ్లని చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మధుకు గాయాలయ్యాయి. మృతుడి స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని మండలం కళ్లబాయిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

బ్యాంకు రుణాల పేరిట కోట్లు స్వాహా చేసిన వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.