ETV Bharat / state

ఒకే నెలలో గరుడ సేవ మూడోసారి... శ్రీవారికి ఇదే మొదటిసారి!

author img

By

Published : Sep 30, 2020, 8:51 PM IST

తిరుమలలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మలయప్పస్వామికి ఒకే నెలలో 3 సార్లు గరుడ వాహన సేవ జరగనుంది.

garuda seva
garuda seva

గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారు ఒకే నెలలో 3 సార్లు గరుడ వాహనంపై విహరించనున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతినెలా పౌర్ణమి రోజున మలయప్పస్వామికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అయితే పౌర్ణ‌మి సంద‌ర్భంగా అక్టోబర్​ నెల 1న, 31న... అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్​ 20న గరుడ వాహనంపై వేంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

బ్రహ్మోత్సవాల వేళ గరుడవాహనంపై ఆసీనులైన మలయప్పను దర్శించుకోవటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల తరలివస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించనున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారు ఒకే నెలలో 3 సార్లు గరుడ వాహనంపై విహరించనున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతినెలా పౌర్ణమి రోజున మలయప్పస్వామికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అయితే పౌర్ణ‌మి సంద‌ర్భంగా అక్టోబర్​ నెల 1న, 31న... అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్​ 20న గరుడ వాహనంపై వేంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

బ్రహ్మోత్సవాల వేళ గరుడవాహనంపై ఆసీనులైన మలయప్పను దర్శించుకోవటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల తరలివస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.