అనంతపురం జిల్లా కదిరి పట్టణం గాంధీనగర్ లో జరిగిన హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న గాంధీనగర్ లో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఘర్షణలో అల్లావుద్దీన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అల్లావుద్దీన్పై బాబా అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కుటాగుళ్ల సమీపంలో అరెస్టు చేశారు. అల్లావుద్దీన్.. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు పంపారు.
ఇదీ చదవండి