కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ అమలు ముమ్మరంగా సాగుతోంది. రోడ్లపై ప్రజలు గుమిగూడకుండా పోలీసులు అన్ని చర్యలను తీసుకుంటున్నారు . విజయవాడ సింగ్నగర్ వద్ద రహదారిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులను నిరోధించారు. ఓవైపు ప్రభుత్వం కట్టడి చర్యలను అమలు చేస్తుంటే.... కేదారేశ్వరపేట రైతుబజార్ జనంతో కిక్కిరిసింది. నిత్యావసర వస్తువులను, కూరగాయలు కొనుగోలు చేసేందుకు నగర వాసులంతా పెద్దఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం