ETV Bharat / city

వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలి: సీఎం జగన్ - వరద నీటిపై సీఎం జగన్ సమీక్ష వార్తలు

రాష్ట్రంలో వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటిని నిలపాలని నిర్దేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

cm jagan review on irrigation
cm jagan review on irrigation
author img

By

Published : Sep 16, 2020, 8:31 PM IST

భూసేకరణ, ఆర్​అండ్​ఆర్‌ ప్యాకేజీలు అమలు చేయాలని.. సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు తీసుకోవద్దని వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. జలవనరుల శాఖలో సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలన్న సీఎం... అవసరమైతే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని సూచించారు. డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతించారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.

రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని ఆయన నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తయిందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్లు బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కొవిడ్‌ రావడం వల్ల స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని వారు వివరించారు. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలని కోరారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని, వారికి నచ్చచెప్పాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలన్నారు.

నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అవుకు 2వ సొరంగం పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్‌లో నల్లమల అడవుల్లో కొండల పైనుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార-నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 33.5 కి.మీకు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. బీఆర్‌ఆర్‌ వంశధార స్టేజ్‌-2 ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిశా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని ప్రాధాన్యత నిచ్చి దీన్ని పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రాజెక్టులో భాగమైన గజపతినగరం బ్రాంచ్‌ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జగన్‌ చెప్పారు. జల వనరుల శాఖలో పనులు కొనసాగుతున్న చోట్ల అవసరాలను బట్టి, అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని, డ్యామ్‌లు, కాల్వలు, వాటర్‌ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతి ఇచ్చారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు

భూసేకరణ, ఆర్​అండ్​ఆర్‌ ప్యాకేజీలు అమలు చేయాలని.. సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు తీసుకోవద్దని వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. జలవనరుల శాఖలో సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలన్న సీఎం... అవసరమైతే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని సూచించారు. డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతించారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.

రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని ఆయన నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తయిందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్లు బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కొవిడ్‌ రావడం వల్ల స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని వారు వివరించారు. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలని కోరారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని, వారికి నచ్చచెప్పాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలన్నారు.

నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అవుకు 2వ సొరంగం పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్‌లో నల్లమల అడవుల్లో కొండల పైనుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార-నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 33.5 కి.మీకు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. బీఆర్‌ఆర్‌ వంశధార స్టేజ్‌-2 ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిశా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని ప్రాధాన్యత నిచ్చి దీన్ని పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రాజెక్టులో భాగమైన గజపతినగరం బ్రాంచ్‌ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జగన్‌ చెప్పారు. జల వనరుల శాఖలో పనులు కొనసాగుతున్న చోట్ల అవసరాలను బట్టి, అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని, డ్యామ్‌లు, కాల్వలు, వాటర్‌ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతి ఇచ్చారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.