ETV Bharat / city

కడప పోలీసులపై రూ.కోట్లకు పరువు నష్టం దావా

author img

By

Published : Jul 16, 2021, 7:43 AM IST

కడప పోలీసులపై తితిదే పాలక మండలి మాజీ ఛైర్మన్​ పుట్టా సుధాకర్​ యాదవ్​ పరువు నష్టం దావా వేశారు. రూ.5కోట్లు వారు చెల్లించాల్సిందిగా ఆదేశించాలంటూ ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు.

defamation suit
పుట్టా సుధాకర్​ యాదవ్​

తనపై తప్పుడు కేసు పెట్టారని కడప పోలీసులపై తితిదే పాలక మండలి మాజీ ఛైర్మన్​ పుట్టా సుధాకర్​ యాదవ్​ రూ.5కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు బుధవారం ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు.

పురపాలక ఎన్నికల సందర్భంగా మైదుకూరు పురపాలిక ఆరో వార్డు కౌన్సిలర్ మహబూబ్బీని తన ఇంట్లో నుంచి పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తరలించారని ఆరోపించారు. ఆరోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. డీఎస్పీ విజయ్ కుమార్,అప్పట్లో పనిచేసిన సీఐ మధుసూదన్ గౌడ్ పై పరువు నష్టం దావాతో పాటు మైదుకూరు కోర్టులో క్రిమినల్ కేసు వేసినట్లు వెల్లడించారు.

తనపై తప్పుడు కేసు పెట్టారని కడప పోలీసులపై తితిదే పాలక మండలి మాజీ ఛైర్మన్​ పుట్టా సుధాకర్​ యాదవ్​ రూ.5కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు బుధవారం ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు.

పురపాలక ఎన్నికల సందర్భంగా మైదుకూరు పురపాలిక ఆరో వార్డు కౌన్సిలర్ మహబూబ్బీని తన ఇంట్లో నుంచి పోలీసులు వాహనంలో ఎక్కించుకుని తరలించారని ఆరోపించారు. ఆరోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. డీఎస్పీ విజయ్ కుమార్,అప్పట్లో పనిచేసిన సీఐ మధుసూదన్ గౌడ్ పై పరువు నష్టం దావాతో పాటు మైదుకూరు కోర్టులో క్రిమినల్ కేసు వేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: Viveka Murder Case: 39వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.