తెలుగుదేశం పార్టీ 219మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులను వెల్లడించింది. 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, కోశాధికారిని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర కమిటీలో బడుగు, బలహీన, ఎస్సీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 61శాతం పదవులను వీరికి కేటాయించింది. 50 ఉపకులాలకు ప్రాధాన్యం కల్పించారు. కమిటీలో బీసీలకు 41, ఎస్సీలకు 11, ఎస్టీలకు 3 శాతం చోటు దక్కింది. మైనార్టీలు 6 శాతం మందికి కొత్త కమిటీలో స్థానం కల్పించింది. కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లు కాగా మహిళలకు ప్రాధాన్యత లభించింది.
తెదేపా ఉపాధ్యక్షులుగా చోటు దక్కించుకున్న వారు వీరే..
- నిమ్మల కిష్టప్ప
- ప్రత్తిపాటి పుల్లారావు
- జ్యోతుల నెహ్రూ
- గొల్లపల్లి సూర్యారావు
- బండారు సత్యానందరావు
- పరసా రత్నం
- దాట్ల సుబ్బరాజు
- పిడతల సాయికల్పనారెడ్డి
- బూరగడ్డ వేదవ్యాస్
- సుజయకృష్ణ రంగారావు
- బి.వి.జయనాగేశ్వర్రెడ్డి
- వై.వి.బి.రాజేంద్రప్రసాద్
- జి.తిప్పేస్వామి
- హనుమంతరాయ చౌదరి
- పుత్తా నర్సింహారెడ్డి
- దామచర్ల జనార్దన్రావు
- శ్రీధర కృష్ణారెడ్డి
- వేమూరి ఆనంద్సూర్య
తెదేపా ప్రధాన కార్యదర్శులుగా..
- పయ్యావుల కేశవ్
- అనగాని సత్యప్రసాద్
- దేవినేని ఉమ
- ఎన్.అమర్నాథ్రెడ్డి
- బాలవీరాంజనేయస్వామి
- బి.టి.నాయుడు
- భూమా అఖిలప్రియ
- ఎం.డి.నజీర్
- గన్ని కృష్ణ
- పంచుమర్తి అనురాధ
- బత్యాల చెంగల్రాయుడు
- గౌతు శిరీష
- దువ్వారపు రామారావు
- బుద్ధా వెంకన్న
- చింతకాయల విజయ్
- మద్దిపాటి వెంకటరాజు