- మా భూములు మాకే కావాలి: విశాఖ ఉక్కు నిర్వాసితులు
విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చి ప్రస్తుతం నిర్వాసితులుగా మారిన వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇంతకుముందు పరిశ్రమ నెలకొల్పడానికి ఇచ్చిన భూములు తిరిగి తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కలెక్టర్పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ గ్రామంలోని ఊరేంగిపు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆత్మగౌరవానికి ప్రతీక.. మన జాతీయ పతాక
నేనంతా పిడికెడు మట్టినే కావచ్చు. కలమెత్తితే మన దేశ జెండాకు ఉన్నంత పొగరు ఉంది..! గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఈ వాక్యాలు.. దాదాపు అందరికీ సుపరిచితమే. త్రివర్ణ పతాకలోని దర్పాన్ని ప్రతిబింబిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమలలో మొరాయించిన సర్వర్... నిలిచిన తితిదే సేవలు
సర్వర్ మొరాయించడంతో.. తితిదే సేవలు నిలిచిపోయాయి. తిరుమలలో 3 గంటలకుపైగా ఆయా సేవలు స్తంభించి.. భక్తులకు అసౌకర్యం కలిగింది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అదానీ ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పగలరా?'
అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా సంక్షోభంలో దేశ ప్రజలు విలవిలలాడిపోయిన వేళ అదానీ తన సంపదనను 50శాతం ఎలా పెంచుకోగలిగారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బిహార్ అసెంబ్లీలో 'మద్యం' రగడ
బిహార్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అక్రమ మద్యం వ్యాపారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రామ్ సూరత్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మయన్మార్ సైన్యం చేతిలో మరో పది మంది బలి
మయన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఐక్యరాజ్య సమితి వినతిని లెక్కచేయకుండా ఆందోళనకారులపై కాల్పులను కొనసాగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మాస్క్ లేకపోతే విమానం నుంచి దించేయండి'
పదేపదే హెచ్చరించినా మాస్క్ను సరిగా ధరించని విమాన ప్రయాణికులను కిందకు దించివేయాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్ధలను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండో టీ20కి కొత్త వ్యూహంతో కోహ్లీ సేన
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ-20లో ఓటమిపాలైన కోహ్లీసేన ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్లో సత్తాచాటాలని భావిస్తోంది. లోపాలను సరిచేసుకుని సిరీస్ను సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజకీయ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారంటే?
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో స్పందించారు. ఓ టీవీ ఛానల్లో ప్రసారం కానున్న ప్రత్యేక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తారక్... ప్రోగ్రామ్ ప్రోమో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.