Prajavani Program In Telangana : రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణిని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున రేపటి నుంచి మళ్లీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి దివ్య కొనసాగుతున్నారు.
ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ పునఃప్రారంభం
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 6, 2024, 7:20 PM IST
![ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ పునఃప్రారంభం PRAJAVANI PROGRAM AGAIN FROM TOMORROW](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-06-2024/1200-675-21652851-thumbnail-16x9-praja-bavan.jpg?imwidth=3840)
Prajavani Program In Telangana : రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో కొనసాగుతుందని ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ వల్ల మార్చి 16 నుంచి ప్రజావాణిని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున రేపటి నుంచి మళ్లీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా ఐఏఎస్ అధికారి దివ్య కొనసాగుతున్నారు.