Minister Komatireddy on Telangana Buildings in AP Possession : ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ఈనెల 6న విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఏపీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనాల స్వాధీనం కోసం నివేదిక సిద్ధం చేయండి : మంత్రి కోమటిరెడ్డి
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 2, 2024, 8:18 PM IST
![ఏపీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనాల స్వాధీనం కోసం నివేదిక సిద్ధం చేయండి : మంత్రి కోమటిరెడ్డి MINISTER REVIEW ON PUBLIC PROPERTY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/1200-675-21852638-thumbnail-16x9-minister.jpg?imwidth=3840)
ఆర్అండ్బీ పరిధిలోని లేక్ వ్యూ, గ్రీన్ లాండ్స్, మంజీర అతిథి గృహాలు, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్బాగ్, కుందన్బాగ్తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల నివాస సముదాయాలను పూర్తిస్థాయిలో రాష్ట్రం పరిధిలోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియ, ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, ఈఎన్సీ గణపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Minister Komatireddy on Telangana Buildings in AP Possession : ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. ఈనెల 6న విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆర్అండ్బీ పరిధిలోని లేక్ వ్యూ, గ్రీన్ లాండ్స్, మంజీర అతిథి గృహాలు, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్బాగ్, కుందన్బాగ్తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల నివాస సముదాయాలను పూర్తిస్థాయిలో రాష్ట్రం పరిధిలోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియ, ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, ఈఎన్సీ గణపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.