ETV Bharat / snippets

ఏపీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనాల స్వాధీనం కోసం నివేదిక సిద్ధం చేయండి : మంత్రి కోమటిరెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 8:18 PM IST

MINISTER REVIEW ON PUBLIC PROPERTY
Minister Komatireddy on Telangana Buildings in AP Possession (ETV Bharat)

Minister Komatireddy on Telangana Buildings in AP Possession : ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్​లోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. ఈనెల 6న విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆర్​అండ్​బీ పరిధిలోని లేక్ వ్యూ, గ్రీన్ లాండ్స్, మంజీర అతిథి గృహాలు, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్​బాగ్, కుందన్​బాగ్​తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల నివాస సముదాయాలను పూర్తిస్థాయిలో రాష్ట్రం పరిధిలోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియ, ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్​బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్​, ఈఎన్సీ గణపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Minister Komatireddy on Telangana Buildings in AP Possession : ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్​లోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. ఈనెల 6న విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆర్​అండ్​బీ పరిధిలోని లేక్ వ్యూ, గ్రీన్ లాండ్స్, మంజీర అతిథి గృహాలు, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్​బాగ్, కుందన్​బాగ్​తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల నివాస సముదాయాలను పూర్తిస్థాయిలో రాష్ట్రం పరిధిలోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియ, ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్​బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్​, ఈఎన్సీ గణపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.