Govt District Doctors Protest In KOTI : రాష్ట్రంలో జిల్లాల బోధనా ఆస్పత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) కార్యాలయం ఎదుట జిల్లాల వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఏళ్లుగా పాతుకుపోయిన డాక్టర్లను బదిలీ చేయాలని వారు కోరారు.
'20ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు, వారిని బదిలీ చేయండి'
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : May 25, 2024, 6:58 PM IST
!['20ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు, వారిని బదిలీ చేయండి' Govt District Doctors Protest In KOTI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-05-2024/1200-675-21558278-thumbnail-16x9-dme.jpg?imwidth=3840)
కొందరు వైద్యులు సంఘాల ముసుగులో బదీలీ కాకుండా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరి పోయాయన్నారు. ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరగడంతో మనోవేదనకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 48ను రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Govt District Doctors Protest In KOTI : రాష్ట్రంలో జిల్లాల బోధనా ఆస్పత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) కార్యాలయం ఎదుట జిల్లాల వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఏళ్లుగా పాతుకుపోయిన డాక్టర్లను బదిలీ చేయాలని వారు కోరారు.
కొందరు వైద్యులు సంఘాల ముసుగులో బదీలీ కాకుండా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరి పోయాయన్నారు. ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరగడంతో మనోవేదనకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 48ను రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు.