Prisoners Release in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షతో 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబసభ్యులను విడుదల చేయాలని ఖైదీల కుటుంబసభ్యులు ప్రజాపాలనలో సీఎం రేవంత్రెడ్డికి దరఖాస్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
నేడు 213 మంది ఖైదీల విడుదల - క్షమాభిక్ష ప్రసాదించిన తెలంగాణ ప్రభుత్వం
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 3, 2024, 8:32 AM IST
|Updated : Jul 3, 2024, 7:28 PM IST
![నేడు 213 మంది ఖైదీల విడుదల - క్షమాభిక్ష ప్రసాదించిన తెలంగాణ ప్రభుత్వం PRISONERS RELEASED IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21855329-thumbnail-16x9-prisinors-2.jpg?imwidth=3840)
ఆయా దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైనవారి వివరాలను ఉన్నతస్థాయి కమిటీకి సమర్పించారు. ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. వారిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, 8 మంది తక్కువకాలం శిక్షపడిన వారున్నారు.
Prisoners Release in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షతో 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబసభ్యులను విడుదల చేయాలని ఖైదీల కుటుంబసభ్యులు ప్రజాపాలనలో సీఎం రేవంత్రెడ్డికి దరఖాస్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఆయా దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైనవారి వివరాలను ఉన్నతస్థాయి కమిటీకి సమర్పించారు. ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. వారిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, 8 మంది తక్కువకాలం శిక్షపడిన వారున్నారు.