Riyan Parag Zimbabwe Tour: టీమ్ఇండియాకు ఎంపికై తొలిసారి సీనియర్ జట్టుతో ట్రావిలింగ్ చేస్తున్న ఉత్సాహంలో తన పాస్పోర్ట్, మొబైల్ మర్చిపోయినట్లు యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ చెప్పాడు. 5మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మందితో కూడిన టీమ్ఇండియా జట్టు బుధవారం జింబాబ్వే చేరుకుంది. ఈ సందర్భంగా పరాగ్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
'వాళ్లతో ట్రావెల్ చేయడం నా కల- ఆనందంలో పాస్పోర్ట్, ఫోన్ మర్చిపోయా'
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jul 3, 2024, 12:57 PM IST
!['వాళ్లతో ట్రావెల్ చేయడం నా కల- ఆనందంలో పాస్పోర్ట్, ఫోన్ మర్చిపోయా' Riyan Parag Zimbabwe Tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21857325-thumbnail-16x9-parag.jpg?imwidth=3840)
'సీనియర్ జట్టుతో ట్రావెలింగ్ చేస్తున్న సంతోషంలో నా పాస్పోర్ట్, ఫోన్ మర్చిపోయాను. వాస్తవానికి నేను మర్చిపోలేదు. వాటిని వేరే ప్లేస్లో ఉంచాను. చిన్నప్పటి నుంచి టీమ్ఇండియా జట్టుతో ప్రయాణించాలనేది నా కల. సాధారణంగా మనం చాలా క్రికెట్ ఆడతాం. కానీ, సీనియర్ జట్టుతో ట్రావెల్ చేయడం, టీమ్ఇండియా జెర్సీ ధరించడం ఎప్పటికీ ప్రత్యేకమే' అని పరాగ్ అన్నాడు. కాగా, జింబాబ్వే టూర్కు ప్రకటించిన జట్టులో పరాగ్ సభ్యుడు.
Riyan Parag Zimbabwe Tour: టీమ్ఇండియాకు ఎంపికై తొలిసారి సీనియర్ జట్టుతో ట్రావిలింగ్ చేస్తున్న ఉత్సాహంలో తన పాస్పోర్ట్, మొబైల్ మర్చిపోయినట్లు యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ చెప్పాడు. 5మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మందితో కూడిన టీమ్ఇండియా జట్టు బుధవారం జింబాబ్వే చేరుకుంది. ఈ సందర్భంగా పరాగ్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
'సీనియర్ జట్టుతో ట్రావెలింగ్ చేస్తున్న సంతోషంలో నా పాస్పోర్ట్, ఫోన్ మర్చిపోయాను. వాస్తవానికి నేను మర్చిపోలేదు. వాటిని వేరే ప్లేస్లో ఉంచాను. చిన్నప్పటి నుంచి టీమ్ఇండియా జట్టుతో ప్రయాణించాలనేది నా కల. సాధారణంగా మనం చాలా క్రికెట్ ఆడతాం. కానీ, సీనియర్ జట్టుతో ట్రావెల్ చేయడం, టీమ్ఇండియా జెర్సీ ధరించడం ఎప్పటికీ ప్రత్యేకమే' అని పరాగ్ అన్నాడు. కాగా, జింబాబ్వే టూర్కు ప్రకటించిన జట్టులో పరాగ్ సభ్యుడు.