Rajya Sabha MP KK To Join in Congress : రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఆయన రాజ్యసభ పదవి 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
నేడు కాంగ్రెస్లో చేరనున్న రాజ్యసభ ఎంపీ కేకే!
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 3, 2024, 2:03 PM IST
![నేడు కాంగ్రెస్లో చేరనున్న రాజ్యసభ ఎంపీ కేకే! MP KK JOINING IN CONGRESS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21858042-thumbnail-16x9-kk.jpg?imwidth=3840)
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. మార్చిలోనే బీఆర్ఎస్ను వీడనున్నట్లు కేకే ప్రకటించారు. ఇప్పటికే ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. ఇక తాజాగా ఆయన హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణ బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీకి వెళ్లారు.
Rajya Sabha MP KK To Join in Congress : రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఆయన రాజ్యసభ పదవి 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. మార్చిలోనే బీఆర్ఎస్ను వీడనున్నట్లు కేకే ప్రకటించారు. ఇప్పటికే ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. ఇక తాజాగా ఆయన హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణ బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీకి వెళ్లారు.