Venkaiah Naidu Books PM Modi : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆ పుస్తకాలను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ విడుదల చేయనున్న పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ మాజీ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర 'వెంకయ్య నాయుడు- లైఫ్ ఇన్ సర్వీస్' మొదటిది. రెండోది 'సెలెబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్తో ఆయన మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేసిన ఫొటో క్రానికల్. ఇక మూడో పుస్తకం 'మాహానేత- లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు' పేరుతో సంజర్ కిషోర్ రచించారు.
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు- ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jun 29, 2024, 3:35 PM IST
![వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు- ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ Venkaiah Naidu Books](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/1200-675-21826030-thumbnail-16x9-venkayya-naidu.jpg?imwidth=3840)
Venkaiah Naidu Books PM Modi : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఆ పుస్తకాలను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ విడుదల చేయనున్న పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ మాజీ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర 'వెంకయ్య నాయుడు- లైఫ్ ఇన్ సర్వీస్' మొదటిది. రెండోది 'సెలెబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్తో ఆయన మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేసిన ఫొటో క్రానికల్. ఇక మూడో పుస్తకం 'మాహానేత- లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు' పేరుతో సంజర్ కిషోర్ రచించారు.