ETV Bharat / snippets

వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు- ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 3:35 PM IST

Venkaiah Naidu Books
Venkaiah Naidu Books (ANI)

Venkaiah Naidu Books PM Modi : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్​లో ఈ కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ ఆ పుస్తకాలను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ విడుదల చేయనున్న పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్​ ఎడిషన్ మాజీ ఎడిటర్​ ఎస్​ నగేశ్​ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర 'వెంకయ్య నాయుడు- లైఫ్​ ఇన్​ సర్వీస్​' మొదటిది. రెండోది 'సెలెబ్రేటింగ్ భారత్​- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్​తో ఆయన మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేసిన ఫొటో క్రానికల్. ఇక మూడో పుస్తకం 'మాహానేత- లైఫ్​ అండ్​ జర్నీ ఆఫ్​ శ్రీ ఎం వెంకయ్య నాయుడు' పేరుతో సంజర్​ కిషోర్​ రచించారు.

Venkaiah Naidu Books PM Modi : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్​లో ఈ కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ ఆ పుస్తకాలను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ విడుదల చేయనున్న పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్​ ఎడిషన్ మాజీ ఎడిటర్​ ఎస్​ నగేశ్​ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర 'వెంకయ్య నాయుడు- లైఫ్​ ఇన్​ సర్వీస్​' మొదటిది. రెండోది 'సెలెబ్రేటింగ్ భారత్​- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్​తో ఆయన మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేసిన ఫొటో క్రానికల్. ఇక మూడో పుస్తకం 'మాహానేత- లైఫ్​ అండ్​ జర్నీ ఆఫ్​ శ్రీ ఎం వెంకయ్య నాయుడు' పేరుతో సంజర్​ కిషోర్​ రచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.