ETV Bharat / snippets

రైతుకు దొరికిన భారీ డైమండ్​- రాత్రికి రాత్రే లక్షాధికారిగా! ఇది రెండోసారట!!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 10:10 AM IST

Farmer Finds Diamond In Madhya Pradesh
Farmer Finds Diamond In Madhya Pradesh (ETV Bharat)

Farmer Finds Diamond In Panna : విలువైన వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. లీజుకు తీసుకున్న గనిలో విలువైన వజ్రం దొరకడం వల్ల ఓ రైతు రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారాడు. దీంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పట్టి బజారియా గ్రామానికి చెందిన దేశ్ రాజ్ అనే రైతుకు లీజుకు తీసుకున్న గనిలో 6.65 క్యారెట్ల డైమండ్ దొరికింది. దీంతో వెంటనే అతడు ఆ వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో దీనిని ఉంచుతామని పన్నా డైమండ్​ ఆఫీసు అధికారులు తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.25 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేశారు. కాగా ఇదే రైతుకు గతంలో వజ్రం దొరికింది. మరోసారి రూ.25 లక్షల విలువైన వజ్రం దొరకడం వల్ల అతడికి కాసుల పంట పండింది.

Farmer Finds Diamond In Panna : విలువైన వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. లీజుకు తీసుకున్న గనిలో విలువైన వజ్రం దొరకడం వల్ల ఓ రైతు రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారాడు. దీంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పట్టి బజారియా గ్రామానికి చెందిన దేశ్ రాజ్ అనే రైతుకు లీజుకు తీసుకున్న గనిలో 6.65 క్యారెట్ల డైమండ్ దొరికింది. దీంతో వెంటనే అతడు ఆ వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో దీనిని ఉంచుతామని పన్నా డైమండ్​ ఆఫీసు అధికారులు తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.25 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేశారు. కాగా ఇదే రైతుకు గతంలో వజ్రం దొరికింది. మరోసారి రూ.25 లక్షల విలువైన వజ్రం దొరకడం వల్ల అతడికి కాసుల పంట పండింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.