Lok Sabha Election Results 2024 Smriti Irani : ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబానికి నమ్మకస్థుడైన కిశోరీ లాల్ శర్మ సమీప అభ్యర్థి స్మృతి ఇరానీపై 1.5లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తమ పార్టీ కంచుకోట అయిన అమేఠీ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఈ విజయంపై ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. 'కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదరసోదరీమణులకు అభినందనలు' అని ఎక్స్ వేదికగా స్పందించారు. దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబం నుంచి 2019లో అమేఠీ సీటును స్మృతి ఇరానీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు గాంధీల కుటుంబానికి నమ్మకస్థుడైన శర్మ చేతిలో ఇరానీ ఓడిపోయారు.
అమేఠీలో స్మృతి ఇరానీకి షాక్- KL శర్మ గెలుస్తారని ప్రియాంకకు ముందే తెలుసట!
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jun 4, 2024, 5:56 PM IST
![అమేఠీలో స్మృతి ఇరానీకి షాక్- KL శర్మ గెలుస్తారని ప్రియాంకకు ముందే తెలుసట! Lok Sabha Election Results 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-06-2024/1200-675-21635553-thumbnail-16x9-irani.jpg?imwidth=3840)
Lok Sabha Election Results 2024 Smriti Irani : ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబానికి నమ్మకస్థుడైన కిశోరీ లాల్ శర్మ సమీప అభ్యర్థి స్మృతి ఇరానీపై 1.5లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తమ పార్టీ కంచుకోట అయిన అమేఠీ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఈ విజయంపై ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. 'కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదరసోదరీమణులకు అభినందనలు' అని ఎక్స్ వేదికగా స్పందించారు. దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబం నుంచి 2019లో అమేఠీ సీటును స్మృతి ఇరానీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు గాంధీల కుటుంబానికి నమ్మకస్థుడైన శర్మ చేతిలో ఇరానీ ఓడిపోయారు.