తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ, ఓమిని కారు ఢీ... ముగ్గురికి గాయాలు

20 రోజుల చిన్నారిని తీసుకుని సంతోషంగా ప్రయాణిస్తున్న వారిని ప్రమాదం వెన్నంటింది. ఆర్టీసీ బస్సు ఢీకొని బాలింత ప్రాణాలతో కోట్టుమిట్టాడుతోంది. తల్లి స్పర్శ కోసం ఆ పసిపాప రోదిస్తోంది.

By

Published : Apr 15, 2019, 7:32 PM IST

బస్సు, ఓమిని ఢీ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ఓమిని కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఉపేంద్ర, సంతోష్, సంధ్యలతో పాటు 20 రోజులు చిన్నారి గాయపడింది. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లి సంధ్యకి బలమైన గాయం కావడం వల్ల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

బస్సు, ఓమిని ఢీ
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. అంతకు ముందు ఉప్పల్ వద్ద మరో కారుని ఢీకొన్నాడని... బస్సు పక్కనే నిలపమని వారించినా వినలేదని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ పారిపోయాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details