యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ఓమిని కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఉపేంద్ర, సంతోష్, సంధ్యలతో పాటు 20 రోజులు చిన్నారి గాయపడింది. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లి సంధ్యకి బలమైన గాయం కావడం వల్ల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఆర్టీసీ, ఓమిని కారు ఢీ... ముగ్గురికి గాయాలు
20 రోజుల చిన్నారిని తీసుకుని సంతోషంగా ప్రయాణిస్తున్న వారిని ప్రమాదం వెన్నంటింది. ఆర్టీసీ బస్సు ఢీకొని బాలింత ప్రాణాలతో కోట్టుమిట్టాడుతోంది. తల్లి స్పర్శ కోసం ఆ పసిపాప రోదిస్తోంది.
బస్సు, ఓమిని ఢీ
ఇవీ చూడండి: వరంగల్లో కనువిందు చేసిన గబ్బిలాలు