ఇక్కడిలా భిన్నంగాజరగడానికి ఒక పురాణ గాథ ప్రచారంలోఉంది. శివుని తపస్సు భగ్నం చేసేందుకు మన్మథుడు ప్రేమబాణం సంధించడం... ముక్కంటి ఆగ్రహానికి గురై దహనమైపోతాడు. అందుకు గుర్తుగా కామదహనం జరుపుకుంటారు. అర్థనారీశ్వరుల కోసమే కాముడు అగ్నికి ఆహుతయినందున... కామదహన వేళలోనే వారి కల్యాణం సముచితమని స్థానికుల అభిప్రాయం. ప్రతీ ఏటా హోలీ రోజు ఈ వైభవం జరిపిన తర్వాతే రంగుల పండుగ జరుపుకుంటారు.
ఇక్కడ శివరాత్రికి కాదు, ఈరోజే శివపార్వతుల కల్యాణం
తూర్పున కాకుండా పడమర ముఖద్వారం.. శివరాత్రి రోజున కాకుండా హోలీ రోజు శివపార్వతుల కల్యాణం... ఈ తతంగమంతా పూర్తయ్యాకే.. రంగుల సందడి మొదలవుతుంది. ఇదేంటి వింతగా ఉంది ఎక్కడో అనుకుంటున్నారా..! మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో.
రారండో వేడుక చూద్దాం
ఇదీ చదవండి:హోలీరే హోలీ... భారతమంతా రంగుల మయం