తెలంగాణ

telangana

ETV Bharat / state

మృగాడిని సత్వరమే శిక్షించండి

మానవ మృగం శ్రీనివాస్​ రెడ్డిని విడుదల చేస్తే తమకు ప్రాణహాని ఉంటుందని హాజీపూర్​ వాసులు ఆందోళన చెందుతున్నారు. నిందితుడికి సత్వరమే శిక్షపడేలా చేయాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకున్నాయి.

By

Published : May 7, 2019, 10:58 PM IST

hazipur-1-1

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​ మానవమృగం శ్రీనివాస్​ రెడ్డిని సత్వరమే శిక్షించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. బాధిత కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి వచ్చి సచివాలయంలో మంత్రులు మహమూద్​ అలీ, ఈటల రాజేందర్​కు అభ్యర్థన పత్రాన్ని సమర్పించారు.

తమ పిల్లలకు ఏ విధంగానైతే నరకం చూపించి అంతమొందించాడో అదేవిధంగా నిందితుడిని శిక్షించాలని కోరారు. శ్రీనివాస్​ రెడ్డికి బెయిల్ ​మంజూరు కాకుండా చేయాలని... అతను విడుదలైతే తమ కుటుంబాలకు ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మృగాడిని సత్వరమే శిక్షించండి

ఇదీ చదవండి: హాజీపూర్​ బాధిత కుటుంబాలకు కలెక్టర్​ పరామర్శ

ABOUT THE AUTHOR

...view details