యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ మానవమృగం శ్రీనివాస్ రెడ్డిని సత్వరమే శిక్షించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. బాధిత కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి వచ్చి సచివాలయంలో మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్కు అభ్యర్థన పత్రాన్ని సమర్పించారు.
మృగాడిని సత్వరమే శిక్షించండి
మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని విడుదల చేస్తే తమకు ప్రాణహాని ఉంటుందని హాజీపూర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. నిందితుడికి సత్వరమే శిక్షపడేలా చేయాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకున్నాయి.
hazipur-1-1
తమ పిల్లలకు ఏ విధంగానైతే నరకం చూపించి అంతమొందించాడో అదేవిధంగా నిందితుడిని శిక్షించాలని కోరారు. శ్రీనివాస్ రెడ్డికి బెయిల్ మంజూరు కాకుండా చేయాలని... అతను విడుదలైతే తమ కుటుంబాలకు ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: హాజీపూర్ బాధిత కుటుంబాలకు కలెక్టర్ పరామర్శ