తెలంగాణ

telangana

ETV Bharat / state

బావిలో హాజీపూర్ గ్రామస్థుల ఆందోళన

హాజీపూర్ నిందితుడు సైకో శ్రీనివాస్​ను వెంటనే అరెస్ట్​ చేయాలని గ్రామస్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కానీ రాత్రి పోలీసులు వారి దీక్షను భగ్నం చేస్తూ వారిని అరెస్ట్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు చిన్నారులను చంపిన బావిలో నిరసనకు దిగారు.

By

Published : May 18, 2019, 5:43 PM IST

బావిలో నిరసన

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 15 మంది గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేసి, దీక్ష భగ్నం చేశారు. పోలీసుల తీరుతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు చిన్నారులను పూడ్చిపెట్టిన బావిలోకి నిరసనకు దిగారు.

బావిలో నిరసన

బావి వద్దకు గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న తమను అర్థరాత్రి అరెస్ట్ చేసి, ఎందుకు భగ్నం చేశారని నిలదీస్తున్నారు. జిల్లా కలెక్టర్​ను కలిసి మాట్లాడాక... సమాధానం విని అప్పుడు కార్యచరణ రూపొందిద్దామని ఊరి పెద్దలు చెప్పటంతో యువకులు బావిలోంచి బయటకు వచ్చారు.

ఇవీ చూడండి: కలెక్టర్​ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details