తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

నేరరహిత సమాజం కోసం నేనుసైతం అంటూ రాచకొండ కమిషనరేట్ పోలీసులు బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.

By

Published : May 25, 2019, 4:56 PM IST

సీసీ కెమెరాల ఏర్పాటు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపూర్ గ్రామంలో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్యచేసి బావిలో పాతిపెట్టిన ఘటనపై గ్రామస్థులు భయాందోళనకు గురి కావొద్దని.. మీ పిల్లలను ధైర్యంగా స్కూల్​కు పంపండి మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్, సీపీ మహేష్ భగవత్ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 లక్షల 60 వేల రూపాయలతో 12 సీసీ కెమెరాలను ప్రారంభించామని తెలిపారు. మహిళలు భయబ్రాంతులకు గురికావొద్దనే సదుద్దేశంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా 9490617111కు వాట్సప్ చేయమని సీపీ సూచించారు.

సీసీ కెమెరాల ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details