తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలగిరిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలగిరి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : May 21, 2019, 5:46 AM IST

శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల కుటుంబ సభ్యుల అనుమానం

యాదాద్రి జిల్లా తిరుమలగిరి పీఎస్ పరిధిలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 19న గంగయ్య బస్తీ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉండే దంతూరు శ్రీనివాస్.. సోమవారం రాత్రి మద్యం తాగి 11 గంటల సమయంలో భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయాసం వచ్చి ఆకస్మాత్తుగా మరణించాడు.
మృతుడికి మద్యం అధికంగా సేవించే అలవాటుందని పోలీసులు తెలిపారు. పది సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఎడమవైపు ఛాతిలో నొప్పి వస్తుండేదని.. నొప్పి నివారణకు మద్యం సేవించేవాడని తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని అక్క మన్నెమ్మ ఫిర్యాదుతో తిరుమలగిరి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలగిరి పీఎస్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details