తెలంగాణ

telangana

ETV Bharat / state

దళిత రైతు ఆత్మహత్యను నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో ధర్నా

దళితులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని సూర్యాపేట జిల్లా కోదాడ భాజపా నాయకులు పేర్కొన్నారు. వారి పట్ల కేసీఆర్​ తీరును నిరసిస్తూ.. కోదాడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

By

Published : Jul 31, 2020, 5:05 PM IST

bjp leaders protest for dalit at kodad mro office suryapet district
దళిత రైతు ఆత్మహత్యను నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో ధర్నా

సిద్దిపేట జిల్లాలో దళిత రైతు ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ... సూర్యాపేట జిల్లా కోదాడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా చేపట్టారు.

తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళితులకు మాయమాటలు చెప్పి మోసం చేసిందని భాజపా రాష్ట్ర నాయకుడు వేలంగిరాజు అన్నారు. కేసీఆర్ తీరు మారకుంటే రాబోయే ఎన్నికల్లో వారే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇవీచూడండి:మొబైల్​ కోసం... స్నేహితుడిపై హత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details