మిల్లర్లు, సహకార సంఘాలు ఏ గ్రేడ్ ధాన్యానికి బీ గ్రేడ్ ధర చెల్లిస్తున్నారని నిజామాబాద్ రైతులు ఆందోళన చేపట్టారు. నవీపేట మండలంలో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గంటన్నరపాటు సాగిన రాస్తారోకోతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు తమ సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు.
ఏ గ్రేడ్ ధాన్యానికి బీ గ్రేడ్ ధర చెల్లిస్తారా: రైతులు
ధాన్యం కొనుగోళ్లలో 5 కిలోల తరుగు తీస్తున్నారని నిజామాబాద్ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైస్ మిల్లర్లు, సహకార సంఘాల వైఖరిని నిరసిస్తూ నవీపేట మండలంలో రాస్తారోకో చేపట్టారు.
ఏ గ్రేడ్ ధాన్యానికి బీ గ్రేడ్ ధర చెల్లిస్తారా: రైతులు