నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం అయ్యాయి. ఇందూరు పరిధిలో ఉన్న 7 శాసన సభ నియోజకవర్గాలకుగాను నిజామాబాద్ జిల్లాలో 5, జగిత్యాల జిల్లాలో 2 స్థానాలు ఉన్నాయి. 185 మంది బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో 1788 పోలింగ్ కేంద్రాలు, 27 వేల బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసినట్లు నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్కి 15 మంది అధికారుల చొప్పున 33 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
మొట్ట మొదటిసారిగా..
ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎమ్3 రకం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంచారు. నోటాతో కలుపుకొని 186 మంది బరిలో ఉన్నట్లు లెక్క. వీరందిరికీ సరిపోయేలా ఎల్ ఆకారంలో 12 ఈవీఎంలను అమర్చినట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేట్లు సహకరించాలని కోరారు.
ప్రత్యేక ఏర్పాట్లు: