తెలంగాణ

telangana

ETV Bharat / state

16 సీట్లు మావే... దేశంలో కీలక పాత్ర మాదే...

'తెరాసకు ఎవరూ పోటీ లేరు. ఎలాగు మనమే గెలుస్తాం. అయినప్పటికీ ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలి. దేశంలో చక్రం తిప్పేలా చేయాలి': చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర మంత్రి

By

Published : Mar 27, 2019, 5:35 AM IST

Updated : Mar 27, 2019, 9:29 AM IST

16 సీట్లు మావే... దేశంలో కీలక పాత్ర మాదే...

రాష్ట్రంలో తెరాస 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ 14 రోజులు ప్రతి కార్యకర్త రాత్రింబవళ్లు కష్టపడి ప్రచారం చేయాలని సూచించారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరఫున మల్లారెడ్డి బోడుప్పల్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. కేసీఆర్ మీద నమ్మకంతో తనని గెలిపిస్తే మల్కాజిగిరిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

16 సీట్లు మావే... దేశంలో కీలక పాత్ర మాదే...
Last Updated : Mar 27, 2019, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details