'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'
భాజపా నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
'అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం'
భావస్వేచ్ఛను హరించేలా తెరాస నేతలు తమపై కేసులు పెడుతున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాషాయ పార్టీ నేతలపై అక్రమకేసులు ఎత్తివేయాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సబ్కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతిపత్రం అందజేశారు.
- ఇదీ చూడండి : ప్రతీ పైసాకు గ్రామ సభ ఆమోదం ఉండాల్సిందే: కేసీఆర్
Last Updated : Aug 30, 2019, 8:25 PM IST