తెలంగాణ

telangana

ETV Bharat / state

కాషాయ కండువా కప్పుకుంటున్న పాలమూరు హస్తం నేతలు

కాంగ్రెస్​పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కొంత మంది గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ తెరాసలోకి వెళ్లారు. ఇటీవల భాజపాలో చేరిన డీకే.అరుణ అనుచరులు కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

By

Published : Mar 26, 2019, 9:50 PM IST

Updated : Mar 26, 2019, 10:59 PM IST

కాంగ్రెస్​పార్టీకి దెబ్బమీద దెబ్బ

కాంగ్రెస్​పార్టీకి దెబ్బమీద దెబ్బ
కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో మరో షాక్ తగలనుంది. 11 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా కొనసాగుతున్న డోకూరు పవన్ ​కుమార్​రెడ్డి భాజాపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 29న మోడీ హాజరవుతున్న మహబూబ్​నగర్ సభలో పవన్ ​కుమార్ తన అనుచరులతో కలసి డీకే అరుణ సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు.

పార్టీ వీడుతున్న నేతలు...

డీకె. అరుణతో రెండు మూడు రోజుల నుంచి జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పవన్ ​కుమార్​తో పాటు అడ్డాకుల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరికొంత మంది నేతలు పార్టీ వీడనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:తెలంగాణ సీఎం కేసీఆర్​కు హైకోర్టు నోటీసులు

Last Updated : Mar 26, 2019, 10:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details