1/70 చట్టాన్ని సవరించి తమ గ్రామంలోని రైతులందరికీ పట్టాలు ఇవ్వాలంటూ రాస్తారోకో చేపట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో చోటు చేసుకుంది. గ్రామంలోని గిరిజనులకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. మిగతావారికి అందకపోవడం వల్ల తమకు పాసు పుస్తకాలు అందించి, రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
'రైతులందరికీ పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలి'
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలోని రైతులందరికీ 1/70 చట్టాన్ని సవరించి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు రాస్తారోకో చేపట్టారు.
రైతుల రాస్తారోకో