పిడుగు పడి మృతి చెందిన ఉపాధి హామీ కూలీ
ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పాలేరు ఈ ఘటన చోటుచేసుకుంది.
పిడుగుపడి వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పిడుగుపాటుకు పెద్దపాక జనార్దన్ మృతి చెందాడు. ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడి జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతినికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.