తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు నిర్మాణం జరిగేది కాదు: పువ్వాడ

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్​ స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.

By

Published : May 13, 2020, 11:44 AM IST

Minister puvvada ajay says Potireddipadu capacity building is not going to happen
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు నిర్మాణం జరిగేది కాదు: పువ్వాడ

పోతిరెడ్డిపాడుపై జగన్ తలపెట్టిన ఎత్తిపోతల సామర్థ్యం పెంపు నిర్మాణం జరిగేదేమీ కాదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న ఆయన.. నాడు పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టిన నేతలే నేడు దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

వైఎస్ హయాంలోనే ఈ ఎత్తిపోతల సామర్థ్యం పెంపును కేసీఆర్​ వ్యతిరేకించారని గుర్తు చేసిన మంత్రి అజయ్.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు కూడా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు నిర్మాణం జరిగేది కాదు: పువ్వాడ

ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

ABOUT THE AUTHOR

...view details