తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుగుల మందు డబ్బాలతో రైతుల రాస్తారోకో

కష్టపడి పండించిన పంటలో తరుగు పేరుతో మిల్లర్లు దోపికి పాల్పడుతుంటున్నారంటూ బొమ్మకల్ గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

By

Published : Dec 14, 2019, 3:13 PM IST

Farmers protest with pesticides
పురుగుల మందు చేతబట్టి రైతుల రాస్తారోకో

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పండించిన ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 2కిలోల చొప్పున తరుగు తీస్తూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.

పురుగుల మందు చేతబట్టి రైతుల రాస్తారోకో
మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై అర్దనగ్న ప్రదర్శన చేసి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details