తెలంగాణ

telangana

ETV Bharat / state

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కామారెడ్డి జిల్లాలో మూడో సోమవారం సందర్భంగా శివాలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు హజరయ్యారు. అనంతరం శ్రావణ మాసం ప్రత్యేక పూజలు చేశారు.

By

Published : Aug 20, 2019, 6:48 AM IST

శ్రావణ మూడో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ

శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడిమేట్ గ్రామంలో మహాదేవుని గుట్టకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మూడో సోమవారం అవడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

శ్రావణ మూడో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details