తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎర్రమట్టి 'మే' సవాల్​

హైదరాబాద్​లోని దూల్​పేట్​లో కండలు తిరిగిన మల్లయోధులు సత్తా చాటారు. ఎర్రమట్టిలో సై అంటే సై అంటూ కుస్తీ పోటీలలో పాల్గొని వీక్షకులను ఉత్సాహపరిచారు.

By

Published : Mar 2, 2019, 10:19 AM IST

Updated : Mar 2, 2019, 10:26 AM IST

కుస్తీ పోటీలలో తలపడుతున్న మల్లయోధులు

పోటీలలో తలపడుతున్న మల్లయోధులు
హైదరాబాద్ దూల్​పేట్​లోని మినీ స్టేడియంలో సుభాష్ చంద్రబోస్ ఛాంపియన్​షిప్​ పేరుతో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 300 మంది పహిల్వాన్లు పాల్గొన్నారు. ప్రతిసారి నిర్వహించినట్లుగా కాకుండా ఈసారి ఎర్రమట్టిలో కుస్తీలు నిర్వహించారు. ఈ మట్టి కుస్తీలు అంతరించిపోతున్నాయని, అలా జరగకుండా తాము ఈ పోటీలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. అదే కాకుండా క్రీడల్లో ఈ కుస్తీలకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Last Updated : Mar 2, 2019, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details