తెలంగాణ

telangana

ETV Bharat / state

"జీవన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు"

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై వేల కోట్ల రుపాయాల భారం పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ భవన్​లో కార్పోరేషన్ ఛైర్మన్లు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు.

By

Published : Aug 29, 2019, 11:46 PM IST

జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఖండించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాలు చెబితే జీవన్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగలేదనడం అయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా సఫలం కావడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details