తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అవగాహన సదస్సు

విద్యార్థుల ఆత్మహత్యలకు తీవ్ర ఒత్తిడే కారణమని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ... దీర్ఘకాలిక విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు.

By

Published : May 2, 2019, 5:48 PM IST

అవగాహన సదస్సు

ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్​లో భారత మానసిక వైద్యుల సంఘం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ - ధీర్ఘకాలిక విధానాలపై ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్​, భారత మానసిక వైద్యుల సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్​ కేశవరావు పాల్గొన్నారు.

తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదంటున్న నిపుణులు

ఒత్తిడే కారణం

తమ పిల్లలు సమాజంలో మంచి స్థాయికి రావాలన్న కోణంలో తల్లిదండ్రులు ఒత్తిడి పెంచడం కూడా ఆత్మహత్యలకు కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్​ విద్యావ్యవస్థలో కేవలం ర్యాంకుల కోసమే పాటు పడుతున్నారని... విద్యార్థులకు కనీసం క్రీడా మైదానం లేకుండా చేస్తున్నారని నిపుణులు వాపోయారు.
ప్రతీ పిల్లవాడిలోనూ ప్రతిభ ఉంటుందని... దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు.

ఇదీ చదవండి : ఆత్మహత్యలపై కొవ్వొత్తుల ప్రదర్శనలకు ఉత్తమ్ పిలుపు

ABOUT THE AUTHOR

...view details