విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహజ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఠాగూర్ ఆడిటోరియంలో సంగీత కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యోగా సాధనతో మనిషి తనలోని భగవంతున్ని దర్శించుకోవచ్చని రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి అన్నారు. మానసిక, శారీరక ఉద్వేగాల నియంత్రణ శక్తి యోగాకు ఉందన్నారు.