తెలంగాణ

telangana

ETV Bharat / state

ర్యాష్ డ్రైవర్లకు పోలీసుల ముకుతాడు

మహానగరంలో రాత్రి వేళల్లో వాహనాలను అతి వేగంగా నడుపుతున్నారన్న ఫిర్యాదుతో  కేబీఆర్​ పార్క్ నుంచి జూబ్లీ చెక్​పోస్టు వరకు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 15 ద్విచక్ర వాహనాలు, 3స్పోర్ట్స్ కార్లు సీజ్​ చేసి 18మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Sep 15, 2019, 6:42 AM IST

Updated : Sep 15, 2019, 7:42 AM IST

ర్యాష్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో వాహనాలను అతివేగంగా నడుతున్న 18 మంది యువకులను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ వరకు తనిఖీలు నిర్వహించగా.. 15 ద్విచక్రవాహనాలు, 3 స్పోర్ట్స్ కార్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో అతివేగంగా నడపడమే కాకుండా వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ డ్రైవ్​ను చేపట్టినట్లు తెలిపారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని... మరోసారి పట్టుపడితే వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

ర్యాష్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Last Updated : Sep 15, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details