తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాజంలో కులం, వర్గం పేరిట విడదీసే వాటిని నిర్మూలించాలి

కులం, వర్గం పేరిట సమాజంలో ప్రజలను విడదీసే వర్గ పోరాటాలను నిర్మూలించే దిశగా అందరూ ముందుకు సాగాలని వామపక్ష నేతలు, మేధావులు సూచించారు.

By

Published : Jul 21, 2019, 11:50 PM IST

సమాజంలో కులం, వర్గం పేరిట విడదీసే వాటిని నిర్మూలించాలి

సమాజంలో కులం, వర్గ పోరాటాలను వేరువేరుగా ప్రోత్సహిస్తున్నారని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. మార్క్సిజం రాష్ట్ర కమిటీ 'అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం' అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కుల వర్గాల పేరుతో ప్రజలతో విలీనం చేసి సామాజిక న్యాయం సాధించడానికి పోరాటం చేస్తే కానీ విజయవంతం కాదని ఎంసీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు.

సమాజంలో కులం, వర్గం పేరిట విడదీసే వాటిని నిర్మూలించాలి

ABOUT THE AUTHOR

...view details