తెలంగాణ

telangana

ETV Bharat / state

గోవధకులను కఠినంగా శిక్షించండి:వీహెచ్‌పీ

తెలుగు రాష్ట్రాల్లో గోవధ నిషేద చట్టం అమలు చేయాలని..గోవధకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి ఖేమ్‌ చంద్‌ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ కోఠిలోని సంఘ్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Aug 21, 2019, 11:50 PM IST

గోవధకులను కఠినంగా శిక్షించండి:వీహెచ్‌పీ

హైదరాబాద్ కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జాతీయ కార్యదర్శి ఖేమ్చంద్ శర్మ హాజర్యయ్యారు. గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో గోహత్యలు జరగడం బాధాకరమన్నారు. గోవధ చట్టాన్ని ఇరు రాష్ట్రల్లోని ప్రభుత్వాలు అమలు చేయాలని... గోవధకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకప్పుడు మన దేశంలో 64 రకాల గోవులు ఉండేవని.. ఇపుడు 32 రకాలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. దేశీయ సంతతి గోవులు అంతరించిపోతున్నాయని వాటిని... పరిరక్షించాల్సిన అవసరం దేశ ప్రజలపై ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నందున.. యువత గో ఆధారిత వ్యవసాయం చేయాలని సూచించారు.

గోవధకులను కఠినంగా శిక్షించండి:వీహెచ్‌పీ
ఇదీచూడండి: కాంగ్రెస్​ కార్యాలయంలో ప్రత్యక్షమైన చిదంబరం

ABOUT THE AUTHOR

...view details