హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కేసీఆర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా... నిజాం పాలనను తలదన్నే విధంగా వ్యవహరిస్తున్నారని నారాయణ ఆరోపించారు. భాజపా, తెరాసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకరిస్తున్న తీరును సీపీఐ వ్యతిరేకించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టింది.
సీపీఐ ఆందోళన